Advertisement

  • జిల్లాలో దారుణ... పండ్లు అమ్ముకునే ఓ మహిళపై యాసిడ్​ దాడి...!

జిల్లాలో దారుణ... పండ్లు అమ్ముకునే ఓ మహిళపై యాసిడ్​ దాడి...!

By: Anji Sat, 12 Dec 2020 5:36 PM

జిల్లాలో దారుణ... పండ్లు అమ్ముకునే ఓ మహిళపై యాసిడ్​ దాడి...!

కర్ణాటక బెళగావి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పండ్లు అమ్ముకునే ఓ మహిళపై దుండగుడు యాసిడ్​ దాడి చేసి పరారయ్యాడు.

తీవ్ర గాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది ఆ మహిళ. జిల్లాలోని రాయబాగ పట్టణం ఝండ కట్టె గ్రామంలో పండ్లు విక్రయిస్తూ జీవినం సాగిస్తోంది యాస్మీన్​ తహసీస్దార్​ (35).

రోజు మాదిరిగానే పండ్లు అమ్ముకుంటుండగా అక్కడికి చేరుకున్న దుండగుడు ఆమెపై యాసిడ్​ దాడి చేశాడు. ఈ ఘటనలో మహిళ పొట్ట, మెడ బాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.

ఆమె అరుపులు విని అక్కడికి చేరుకున్న స్థానికులు నీటిని చల్లి.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

అయితే.. యాసిడ్​ దాడికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దుండగుడి కోసం గాలింపు చేపట్టారు రాయబాగ పోలీసులు.

Tags :

Advertisement