ఆచార్య గురించి త్రిష క్లారిటీ
By: chandrasekar Fri, 02 Oct 2020 4:02 PM
టాలీవుడ్ మెగాస్టార్
చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రంలో మొదట హీరోయిన్ గా చిత్రబృంద౦ త్రిషను అనుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత
చిరు ప్రాజెక్టులో త్రిష నటించడం లేదని తెలిసింది. దీనిపై రకరకాల వార్తలు
కూడా వెలువడ్డాయి.
త్రిషను బృందమే పక్కన
పెట్టారా, త్రిషనే
ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందా.., అని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై
తాజాగా త్రిష క్లారిటీ ఇచ్చింది.
కొన్నిసార్లు ఊహించినట్టుగా
జరుగదు. కొన్ని సృజనాత్మక విభేదాల వల్ల తాను చిరంజీవి సినిమాలో నటించడం లేదని
చెప్పింది. అయితే ఆచార్య చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది.
త్వరలోనే ఓ మంచి
చిత్రంతో తాను ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ బ్యూటీ 2016లో వచ్చిన
నాయకి ప్రాజెక్టులో చివరిసారిగా నటించింది. ఆ తర్వాత మరే చిత్రం చేయలేదు.
ఆచార్య చిత్రంలో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు.