శుక్రవారం బులిటెన్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో 9,999 పాజిటివ్ కేసులు
By: chandrasekar Sat, 12 Sept 2020 09:23 AM
శుక్రవారం బులిటెన్
ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో 9,999 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్
కేసులు సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు గత రెండు వారాలుగా కేసుల సంఖ్య పెరుగుతూనే
వస్తోంది. శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో 71,137 శాంపిల్స్ పరీక్షించగా మరో 9,999
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీ లో మొత్తం కరోనా
వైరస్ కేసుల సంఖ్య 5,47,686కు చేరింది. గడచిన 24 గంటల్లో 77మంది
చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4779కి చేరింది. గత 24 గంటల్లో 11,069మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో
కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,46,716గా నమోదయ్యింది. మరో 96,191మంది హాస్పిటల్లో
చికిత్స పొందుతున్నారని పేర్కొంది.
రాష్ట్రంలో గడచిన 24
గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1499,
పశ్చిమగోదావరి జిల్లాలో 1081, చిత్తూరు జిల్లాలో 1040, గుంటూరు జిల్లాలో 920, ప్రకాశం జిల్లాలో 901, నెల్లూరు
జిల్లాలో 778, కడప జిల్లాలో 698,
విజయనగరం జిల్లాలో 594, శ్రీకాకుళం జిల్లాలో 570, అనంతపురం
జిల్లాలో 557, కర్నూలు జిల్లాలో 497, కృష్ణా జిల్లాలో 451, విశాఖపట్నం
జిల్లాలో 413 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా
తూర్పుగోదావరి జిల్లాలో 73,996 పాజిటివ్ కేసులు తర్వాత కర్నూలు జిల్లాలో కేసులు 50679కు
చేరాయి. అనంతపురం జిల్లాలో 48,105 కేసులు ఉన్నాయి. కట్టడి చేయడానికి వీలు లేని విధంగా కొత్త కేసులు
వస్తున్నట్లు తెలిపారు.