Advertisement

  • తిరుపతి స్విమ్స్ కోవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం..ఆరునెలల గర్భిణీ మృతి

తిరుపతి స్విమ్స్ కోవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం..ఆరునెలల గర్భిణీ మృతి

By: Sankar Mon, 05 Oct 2020 09:30 AM

తిరుపతి స్విమ్స్ కోవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం..ఆరునెలల గర్భిణీ మృతి


తిరుపతి స్వీమ్స్ పద్మావతి కోవిడ్ సెంటర్ లో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తుపై నుండి దిమ్మెలు పడి ఓ మహిళా ఉద్యోగి మృతి చెందింది.

మరో ఇద్దరు కోవిడ్ రోగులు తీవ్రంగా గాయాపడ్డారు. మృతి చెందిన మహిళ ఆరు నెలలు గర్భవతి కావడం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. కరోనా రోగులకు సేవలందించిన అటెండర్ ఇలా మృతిచెందడం విషాదంగా మారింది.. కరోనా బారినపడి బ్రతుకు జీవుడా అంటూ ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన బాధితులు గాయాలతో బెడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాత్రి 10.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా, ఈ బిల్డింగ్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. కొత్త భవనంలో కోవిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు అధికారులు.. కానీ, అక్కడ ప్రమాదం గర్భిణి ప్రాణాలు తీసింది.

Tags :
|

Advertisement