జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశృతి..రెండు కార్ల మధ్యలో బైక్..!
By: Anji Wed, 02 Dec 2020 8:05 PM
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరారు. కంకిపాడు మీదుగా కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటన మొదలవుతుంది.
ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ మీదుగా భట్టిప్రోలు చావలి, తెనాలి వైపు ఈ పర్యటన సాగబోతున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది.
రెండు కార్ల మధ్యలో బైక్ ఇరుక్కుంది. బైక్పై ఉన్న వ్యక్తి కాలు విరిగింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండల కనుమూరు దగ్గర చోటు చేసుకుంది.
కాగా, ఈ పర్యటన సందర్భంగా ఆయా జిల్లాల జనసేన నేతలతోనూ పవన్ కల్యాణ్ చర్చలు జరిపి, తమ పార్టీ బలోపేతంపై ఆయన వారికి సూచనలు చేస్తారు. పవన్ పర్యటన నేపథ్యంలో జనసేన నేతలు ఆయా ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.