Advertisement

  • వేలంలో 59 లక్షలకుపైగా పలికిన అమెరికా మాజీ అధ్యక్షుడి వెంట్రుకలు

వేలంలో 59 లక్షలకుపైగా పలికిన అమెరికా మాజీ అధ్యక్షుడి వెంట్రుకలు

By: Sankar Mon, 14 Sept 2020 2:46 PM

వేలంలో 59 లక్షలకుపైగా పలికిన అమెరికా మాజీ అధ్యక్షుడి వెంట్రుకలు


అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ కు చెందిన తల వెంట్రుకలు, రక్తంతో తడిసిన టెలిగ్రాం రూ.59.51 లక్షలకు పైగా వేలంలో అమ్ముడయ్యాయి. అమెరికాలోని బోస్టన్‌లో ఆర్‌ఆర్‌ ఆక్షన్‌ అనే సంస్థ ఈ వేలం నిర్వహించింది. అయితే వాటిని దక్కించుకున్న వారి పేరును సదరు సంస్థ బహిర్గతం చేయలేదు.

1865లో లింకన్‌ హత్యకు గురైన తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించినప్పుడు 2 అంగుళాల (5 సెం.మీ) పొడవు గల ఆయన వెంట్రుకలను తొలిగించారు. అటుపై ఆ వెంట్రుకల క్లిప్పింగ్‌ను వైద్యులు అక్కడే ఉన్న లింకన్‌ భార్య మేరి టోడ్‌ లింకన్‌ బంధువు, కెంటకీ పోస్ట్‌మాస్టర్‌ డాక్టర్‌ ల్యామన్‌ బీచర్‌ టోడ్‌కు అప్పగించారు.

నాటి నుంచి సదరు వెంట్రుకల క్లిప్పింగ్‌ 1945 వరకు తమ ఆధీనంలోనే ఉందని డాక్టర్‌ లోడ్‌ తనయుడు జేమ్స్‌ టోడ్‌ తెలిపారు. దాన్ని 1999లో విక్రయించారని ఆర్‌ఆర్‌ ఆక్షన్‌ తెలిపింది.

Tags :
|
|

Advertisement