సుమారు రూ . 1100 కోట్లకు పైగా పోకో పేరుతో ఆన్ లైన్ బెట్టింగ్
By: chandrasekar Fri, 14 Aug 2020 11:32 AM
హైదరాబాద్ పోలీసులు ఆన్
లైన్ బెట్టింగ్ పాల్పడుతున్న ఓ ముఠాను
అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు రూ . 1100 కోట్లకు పైగా ఆన్ లైన్
బెట్టింగ్ కు పాల్పడినట్టు చెబుతున్నారు.
పోకో పేరుతో ఆన్లైన్
బెట్టింగ్ చేస్తున్న చైనా కంపెనీ పై దాడులు నిర్వహించగా ఈ చీకటి వ్యాపారం వెలుగులోనికి వచ్చింది.
హైదరాబాద్ సైబర్ క్రైమ్
పోలీసులు ఈ కేసులో చైనా వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముఠా
పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించినట్టు తెలిసింది.
భారత దేశం లోని యువతను
లక్ష్యం చేసుకొని ఈ చైనా ఆన్ లైన్ గేమ్స్ ద్వారా మోసం చేస్తున్నట్టు పోలీసులు
తెలిపారు.
రూ .1100 కోట్ల
వరకు ఈ గేమ్స్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు
కొనసాగిస్తున్నారు.