పదవ తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలి ..మంచు విష్ణు
By: Sankar Mon, 29 June 2020 6:14 PM
కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి ..అయితే లాక్ డౌన్ లో కొంచెం సడలింపులు ఇచ్చినప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గకపోవడం వలన కొన్ని రాష్ట్రాలలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసారు ..అందులో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉన్నాయి ..అయితే పదవ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలనీ అన్నారు తెలుగు సినిమా హీరో మంచు విష్ణు ..
ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. 14,15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి? అంటూ మంచు విష్ణు ట్విటర్లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక పలువురు నెటిజన్లు విష్ణు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు
గతంలో 7వ తరగతి విద్యార్థులకు కూడా బోర్డు పరీక్షలు ఉండేవని ఆ తర్వాత తీసేశారని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘విద్యాభ్యాసానికి మన పరీక్షల నిర్వహణ వ్యవస్థ ఒక శాపం లాంటిది’ అని జాకీర్ హుస్సేన్ కమిటీ 1939 లోనే వ్యాఖ్యానించిన విషయాన్ని మరో నెటిజన్ గుర్తుచేశాడు.