Advertisement

  • జూనియర్ బచ్చన్ కు కరోనా నెగటివ్ ..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

జూనియర్ బచ్చన్ కు కరోనా నెగటివ్ ..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

By: Sankar Sun, 09 Aug 2020 10:29 AM

జూనియర్ బచ్చన్ కు కరోనా నెగటివ్ ..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్



ఇటీవాలా కరోనా బారిన పడిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో అందరు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు ..అమితాబ్ తో పాటు అయన కుమారుడు అభిషేక్ , కోడలు ఐశ్వర్య రాయి , మనవరాలు ఆరాధ్య కరోనా బారిన పడగా ఐశ్వర్య , ఆరాధ్య ముందుగా కరోనా నుంచి కోలుకున్నారు ..ఆ తర్వాత అమితాబ్ కూడా కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు ..తాజాగా అభిషేక్ బచ్చన్ కూడా కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రకటించాడు ..

గత కొంతకాలంగా కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయన‌ చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ వచ్చిందని తాను హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు అభిషేక్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ప్రామిస్‌‌ ఈజ్‌ ఏ ప్రామిస్‌! ఈ రోజు మధ్యాహ్నం చేసిన కరోనా పరీక్షల్లో నాకు నెగిటివ్‌ వచ్చింది. నేను కరోనాను జయిస్తానని చెప్పినట్టుగానే జయించాను. ఇది మీ ప్రార్థనలతోనే సాధ్యమైంది’ అంటూ రాసుకొచ్చారు.

నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికి ధన్యవాదాలు. అంతేగాక నానావతి ఆస్పత్రి డాక్టర్‌లకు, నర్సులకు నా ప్రత్యేక ధన్యవాదాలు’’ అంటూ అభిషేక్‌ ట్వీట్‌ చేశారు.అమితాబ్ బచ్చన్ కూడా ఈ సందర్భంగా అందరికి కృతజ్ఞతలు చెప్పాడు ..

Tags :
|
|

Advertisement