కరోనా బారిన పడి కోలుకున్న అనుభవాలను పంచుకున్న అభిషేక్ బచ్చన్
By: chandrasekar Sat, 12 Sept 2020 09:44 AM
భారత్లో కరోనావైరస్
వినాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు నాయకులు
ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కొడలు
ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్య అందరూ కరోనా బారిన పడి కోలుకున్న
సంగతి తెలిసిందే. అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడి కోలుకున్న అనుభవాలను తాజాగా
సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.
కరోనా వల్ల తాను
ఎదుర్కొన్న విషయాలు వివరించారు. ఈ మేరకు ఆయన వీడియోను కూడా షేర్ చేశారు. కరోనాను
తెలిగ్గా కొట్టిపారేయొద్దంటూ ఆయన అందరికీ సూచించారు. కోవిడ్ బారిన పడకుండా ప్రతి
ఒక్కరూ ఎక్కడున్నా ఎటువెళ్లినా మాస్క్ ధరించాలని కరోనావైరస్ను ఏమాత్రం తేలిగ్గా
తీసుకోవద్దు అంటూ అందరూ మాస్క్ ధరిస్తూ సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం అంటూ
అభిషేక్ సూచించారు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో తనకు, తన
కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అభిషేక్ బచ్చన్ కృతజ్ఞతలు తెలిపారు.