ఎబి డివిలియర్స్ అత్యుత్తమ ఐపీయల్ జట్టు ప్రకటన ..సారధిగా భారత దిగ్గజ ఆటగాడు
By: Sankar Wed, 01 July 2020 7:01 PM
సౌత్ ఆఫ్రికా విధ్వంసక వీరుడు ఎబి డివిలియర్స్ తన అత్యుత్తమ ఐపీయల్ జట్టును ప్రకటించాడు ..ఇందులో భారత్ నుంచి ఏడుగురిని సెలెక్ట్ చేసిన ఎబి ..విదేశీ ఆటగాళ్ల కోటాలో నలుగురిని ఎంపిక చేసాడు .అయితే తన టీం కెప్టెన్ అయిన కోహ్లీ ను కాదని ఐపీయల్ లో అత్యంత విజయవంతం అయినా కెప్టెన్ లలో ఒకడైన ధోనిని కెప్టెన్ గా నియమించాడు ..
ఇక ఓపెనర్లుగా భారత దిగ్గజ ఆటగాళ్లు అయిన సెహ్వాగ్ , రోహిత్ లను తీసుకున్నాడు ..వన్ డౌన్ లో కోహ్లీని తీసుకున్న ఎబిడి , నాలుగో స్థానంలో తనకు తానే తీసుకున్నాడు ..ఇక విదేశీయుల కోటాలో తనతో పాటు బెన్ స్టోక్స్ , రషీద్ ఖాన్ , రబడా లను తీసుకున్నాడు ..ఇక బౌలర్లలో స్వదేశీ ఆటగాళ్ల కోటాలో జడేజా , భువనేశ్వర్ కుమార్ , బుమ్రా లను తీసుకున్నాడు ..ఐపీఎల్ టీమ్స్ పరంగా చూసుకుంటే మూడు జట్ల ఆటగాళ్లకి ఎక్కువగా చోటు లభించినట్లు తెలుస్తోంది. కోల్కతా నైట్రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల నుంచి కనీసం ఒక్కరికి కూడా చోటు దక్కలేదు..
ఎబిడి ఐపీయల్ అత్యుత్తమ జట్టు : వీరేంద్ర సెహ్వాగ్ , రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , ఏబీ డివిలియర్స్ , బెన్స్టోక్స్ , మహేంద్రసింగ్ ధోనీ(కెప్టెన్ ) , రవీంద్ర జడేజా , రషీద్ ఖాన్ , భువనేశ్వర్ కుమార్ , కగిసో రబాడ , జస్ప్రీత్ బుమ్రా