ఎబి డివిలియర్స్ విధ్వంసక ఇన్నింగ్స్ ...ఆనందంలో ఆర్సీబి అభిమానులు
By: Sankar Tue, 22 Sept 2020 08:22 AM
ఎబి డివిలియర్స్ ..ఈ పేరుతెలియని క్రికెట్ అభిమాని ఉండదు అంటే అతిశయోక్తి కాదు..తన అరివీర భయంకర విధ్వంసక ఆటతీరుతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎబి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి చాలాకాలం అవుతుంది..అయినా కూడా ఎబి లాంటి ఆటగాడు ఎంతకాలం తర్వాత బరిలోకి దిగిన ఆటతీరుతో ఏ మార్పు ఉండదు అని నిరూపిస్తూ నిన్న జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయి ఆర్సీఐబి జట్టుకు అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు..
ఏబీడీ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్లతో 51 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్ మూడో బంతికి రెండు పరుగుకోసం యత్నించే క్రమంలో డివిలియర్స్ రనౌట్గా పెవిలియన్ చేరాడు. మనీష్ పాండే వేసిన అద్భుతమైన త్రోను బెయిర్స్టో ఎటువంటి వృథా చేయకుండా ఏబీడీని రనౌట్ చేశాడు. దాంతో డివిలియర్స్ మరికొన్ని మెరుపుల్ని ఆర్సీబీ అభిమానులు మిస్సయ్యారు.
ఇక టాస్ గెలిచిన సన్రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్కు దిగింది .ఆర్సీబీ ఇన్నింగ్స్ను కేరళ కుర్రాడు దేవదూత్ పడిక్కల్, అరోన్ ఫించ్లు ఆరంభించారు. వీరిద్దరూ దాటిగా ఆడి ఆర్సీబీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా పడిక్కల్ దాటిగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, ఫించ్ మాత్రం కాస్త నెమ్మదిగా ఆడాడు. పడిక్కల్ 42 బంతుల్లో 8ఫోర్లతో 56 పరుగులు చేశాడు.
ఆ తర్వాత ఫించ్ దూకుడు పెంచే యత్నంలో అభిషేక్ శర్మ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. పడిక్కల్ను విజయ్శంకర్ బౌల్డ్ చేసిన స్వల్ప వ్యవధిలోనే ఫించ్ కూడా ఔటయ్యాడు. కోహ్లి(14) నిరాశపరచాడు. నటరాజన్ బౌలింగ్లో భారీ షాట్ ఆడి రషీద్ ఖాన్కు దొరికిపోయాడు. దూబే(7) ఆట మరీ పేలవంగా సాగింది. దాంతో ఆర్సీబీ నిర్ణీత 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది..