ఈ ఏడాది అభిమానులను నిరాశపరచకుండా ఆడుతాము ..ఎబిడి
By: Sankar Thu, 17 Sept 2020 11:14 AM
ఐపీయల్ లో అత్యంత పాపులారిటీ ఉన్న జట్లలో ఆర్సీబి ఒకటి..ఇంతవరకు ఒక్కసారి కూడా ఆర్సీఐబి కప్పు కొట్టలేకపోయింది ..అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఆర్సీబీ టైటిల్ ను గెలిచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ టీంలో లెజెండరీ బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికి ఇప్పటివరకు ఒకసారి కూడా టైటిల్ అందుకోలేకపోయింది. కానీ ఈ సీజన్ లో మాత్రం ఆర్సీబీ అద్భుతంగా రాణించగలము అనే పట్టుదలతో ఉంది.
ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కీలక ఆటగాడు ఎబి డెవిలియర్స్ ఈ ఏడాది టైటిల్ గెలుస్తాము అనే నమ్మకంతో ఉన్నారు. ఇక తాజాగా డెవిలియర్స్ మాట్లాడుతూ.. కోహ్లీ కెప్టెన్సీ పై నమ్మకంతో ఉన్నట్లు తెలిపాడు. అతను ఎప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తాడు. అయితే వారు కూడా కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లను అనుకరించడం చాలా సులభం అని అన్నాడు. ఇలాంటి కరోనా పరిస్థితుల్లో కూడా బీసీసీఐ ఐపీఎల్ ను నిర్వహించడం అభినందనీయం. ఈ టోర్నీ ఆడటానికి ఆర్సీబీ కూడా ఉత్సహంగా ఉంది. సహచర ఆటగాళ్ళతో కలిసి జట్టును విజేతగా నిలపడానికి కృషి చేస్తాను అని ఎబిడి అన్నాడు.
ఇక ఈ ఏడాది అభిమానులను నిరాశ పరచకుండా ఆడుతామని ఎబి డెవిలియర్స్ చెప్పాడు. అయితే ఈ ఏడాది ఆర్సీబీ మొదటి మ్యాచ్ ఈ నెల 21న సన్ రైజర్స్ తో ఆడనుంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో మొత్తం 154 మ్యాచ్ లు ఆడిన డెవిలియర్స్ 4,395 పరుగులు చేసాడు.