ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన రికార్డు సాధించిన ఎబిడి
By: Sankar Tue, 29 Sept 2020 4:16 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ అరుదైన ఘనత సాధించాడు. సోమవారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో బెంగళూరు గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన డివిలియర్స్ (24 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో 4,500 పరుగుల మైలురాయిని చేరుకున్న ఐదో బ్యాట్స్మన్గా ఏబీడీ రికార్డు సృష్టించాడు.ఈ ఫీట్ అందుకున్న రెండో విదేశీ ప్లేయర్గా నిలిచాడు. విదేశీ ఆటగాళ్లలో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒక్కడే ఇప్పటివరకు 4,500 రన్స్ చేశాడు. ఓవరాల్గా ఈ జాబితాలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ చోటు దక్కించుకోగా తాజాగా డివిలియర్స్ చేరాడు.
2018లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన డివిలియర్స్ ఐపీఎల్ కెరీర్ను ఢిల్లీ డేర్డెవిల్స్తో ఆరంభించాడు. ఆ తర్వాత బెంగళూరులో చేరిన డివిలియర్స్ చాలా ఏండ్ల నుంచి ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కోహ్లీ, డివిలియర్స్ మధ్యనున్న అనుబంధం ఏంటో అందరికీ తెలిసిందే.