ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇంటిపై దాడి ...ఆప్
By: Sankar Thu, 10 Dec 2020 8:39 PM
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా ఇంటిపై బీజేపీ గూండాలు దాడి చేశారని, దీనికి ఢిల్లీ పోలీసులు సహకరించారని అధికార ఆప్ పార్టీ ఆరోపించింది.
శిసోడియా ఇంట్లో లేనప్పుడు బీజేపీ కార్యకర్తలు బలవంతంగా గేట్ తెరిచి లోనికి ప్రవేశించారని, పోలీసులు వారిని అడ్డుకోక చూస్తూ ఉండిపోయారని విమర్శించింది. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. కాగా పోలీసుల సమక్షంలోనే బీజేపీ గూండాలు డిప్యూటీ సీఎం ఇంట్లోకి ప్రవేశించారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.
రోజు రోజుకు బీజేపీ ఎందుకు నిరాశకు గురవుతున్నదని ట్విట్టర్లో ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి తన పార్టీ గూండాలు, పోలీసులతో ఆప్ నేత, డిప్యూటీ సీఎం మనీష్ ఇంటిపై దాడి చేయించారని ఆ పార్టీ నేత అతిషి మార్లేనా ఆరోపించారు. రాజకీయ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డే అని విమర్శించారు.