Advertisement

  • ఐపీఎల్ 2020 సీజన్‌ మ్యాచ్‌‌ల టైమింగ్స్ మార్పు‌‌..ప్రశంసించిన ఆకాశ్ చోప్రా

ఐపీఎల్ 2020 సీజన్‌ మ్యాచ్‌‌ల టైమింగ్స్ మార్పు‌‌..ప్రశంసించిన ఆకాశ్ చోప్రా

By: chandrasekar Tue, 04 Aug 2020 4:13 PM

ఐపీఎల్ 2020 సీజన్‌ మ్యాచ్‌‌ల టైమింగ్స్ మార్పు‌‌..ప్రశంసించిన ఆకాశ్ చోప్రా


భారత మాజీ క్రికెటర్-కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ఐపీఎల్ 2020 సీజన్‌ మ్యాచ్‌ల టైమింగ్స్ మార్పు తెలివైన నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగేలా ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో ఏకంగా 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండగా గత సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది అరగంట ముందే మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. 2008లో ఐపీఎల్ ప్రారంభమవగా ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగిశాయి.

సాధారణంగా రోజులో రెండు మ్యాచ్‌లు ఉంటే, మధ్యాహ్నం 4 గంటలకి ఒకటి, రాత్రి 8 గంటలకి మరొకటి జరగడం తొలి సీజన్‌ని ఆనవాయితీగా వస్తోంది. రోజులో ఒక్క మ్యాచ్‌ ఉన్నా అది రాత్రి 8 గంటలకే ప్రారంభమయ్యేది. కానీ ఐపీఎల్ 2020 సీజన్‌లో మాత్రం అరగంట ముందే అంటే మధ్యాహ్నం 3.30కి రాత్రి 7.30కి మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల టైమింగ్స్ మార్పుపై తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ‘‘ఐపీఎల్ మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకే ప్రారంభమవడం అనేది తెలివైన నిర్ణయం. 7.30 తర్వాత (8 గంటలకి) స్టార్ట్ అయ్యే మ్యాచ్‌లు సాధారణంగా రాత్రి 11.30 లేదా 11.45కి ముగుస్తాయి. దాంతో మ్యాచ్‌లు ఆఖరి వరకూ చూడటం కొంత మందికి కష్టమే’’ అని వెల్లడించాడు. అర్ధరాత్రి ముగిసే మ్యాచ్‌లకి వ్యూవర్‌‌షిప్ తగ్గుతోందని ఇటీవల ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే.

Tags :
|

Advertisement