చైనాలో ఐఫోన్ కోసం తన కిడ్నీ అమ్ముకున్న యువకుడు
By: chandrasekar Wed, 18 Nov 2020 07:38 AM
ఆపిల్ ఐఫోన్ కోసం చైనాలో
ఒక యువకుడు ఏకంగా తన కిడ్నీనే అమ్ముకున్నాడు. స్మార్ట్ ఫోన్స్ ఇష్టపడే వారిలో
యాపిల్ తయారు చేసే ఐఫోన్స్కి ఉండే క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా
చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఖరీదైన ఈ స్మార్ట్ ఫోన్ సాధారణ, మధ్య
తరగతి వారికి ఎప్పుడూ ఓ అందని ద్రాక్షలాంటిదే. ప్రతీ ఏడాది కొత్త ఐఫోన్ మార్కెట్లోకి
విడుదలైనప్పుడు దానిని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే వారి సంఖ్యకి కొదువే లేదు.
కొన లేని వారు, కొనుగోలు చేసిన వారు ఆ ఐఫోన్ ధరలపై వేసుకునే జోకులు
కూడా అన్నీ ఇన్ని కావు. అలా ఐఫోన్ కొత్త మోడల్ విడుదలైన ప్రతీసారి వైరల్ అయ్యే
జోక్స్లో కిడ్నీ అమ్మి అయినా ఐఫోన్ కొనుక్కోవాలనే జోక్ కూడా ఒకటి. జనం ఇది
సరదాగానే చెప్పుకున్నప్పటికీ చైనాకు చెందిన
ఓ కుర్రాడు దాదాపు 9 ఏళ్ల క్రితమే ఈ జోకుని నిజం చేసి చూపించాడు. చైనాకు
చెందిన వాంగ్షాంగ్ గురించి తెలుసుకుని తీరాల్సిందే. స్మార్ట్ ఫోన్ కోసం వీరు
ఏదైనా చేస్తారు.
అనగా 2011లో
అప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్, ఐపాడ్ని సొంతం చేసుకోవాలని కలలకన్న వాంగ్షాంగ్
అందుకోసం తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఏకంగా తన కిడ్నీనే అమ్మేశాడు. కిడ్నీ అమ్మగా
వచ్చిన డబ్బులతో తన కోరిక తీర్చుకున్నాడు. కానీ ఆ తర్వాత కొద్దికాలానికే మరో
కిడ్నీ పనిచేయడం మానేయడంతో ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నాడు. బ్లాక్
మార్కెట్లో సుమారు 4,500 ఆస్ట్రేలియన్ డాలర్లకు కిడ్నీ అమ్మేసిన వాంగ్షాంగ్
ఆ డబ్బుతో ఐఫోన్ 4, ఐప్యాడ్ కొన్నాడు కానీ ఆ తర్వాత అనారోగ్యంతో
మంచంపట్టడంతో అందులోని మజాను ఆస్వాదించలేకపోయాడు. పైగా రెగ్యులర్గా డయాలసిస్
చేయించుకుంటే కానీ ప్రాణాలు నిలబడే అవకాశం లేదు. ఇదిలా ఉండగా, తన
కొడుకు బ్లాక్ మార్కెట్లో కిడ్నీ అమ్ముకున్నాడనే విషయం తెలుసుకున్న వాంగ్షాంగ్
తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాంగ్షాంగ్ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
చేసుకుని విచారణ చేపట్టిన అక్కడి పోలీసులు కిడ్నీ బ్లాక్ మార్కెట్ రాకెట్కి సంబంధించి తొమ్మిది మందిని అదుపులోకి
తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో వాంగ్షాంగ్కి అక్రమంగా సర్జరీ చేసిన ఐదుగురు
వైద్యులు కూడా ఉన్నారు. వీరిపై చర్యలు తీసుకోనున్నారు.