Advertisement

  • ముథోల్ మండలంలో వివాహిత అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు

ముథోల్ మండలంలో వివాహిత అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు

By: chandrasekar Tue, 25 Aug 2020 08:56 AM

ముథోల్ మండలంలో వివాహిత అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టిన  యువకుడు


ముథోల్‌ మండలంలో వివాహిత అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో యువకుడు పెట్టిన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆ యువకుడు ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో మనస్తాపం చెందిన ఆ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముథోల్‌ మండల కేంద్రానికి చెందిన పురుషోత్తం యాదవ్‌ అలియాస్‌ పన్ను అదే ఊరిలోని ఓ వివాహితను గత కొంత కాలంగా వేధిస్తు వున్నాడు.

ఇటీవల్ల ఫేస్‌బుక్‌లో ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన చిత్రాలను యువకుడు పోస్టు చేశాడు. ఈ పోస్టును చూసిన మహిళ తీవ్రంగా మనస్తాపానికి గురవ్వడంతో ఆమె పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

సంఘటన స్థలానికి చేరుకున్న ముథోల్‌ సీఐ అజయ్‌బాబు, ఎస్సై అశోక్, భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు న్యాయం చేస్తామని వారి బందువులకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించి బాధితురాలికి మెరుగైన చికిత్స అందించేందుకు భైంసా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి యొక్క భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపించినట్లు సీఐ వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు మరెక్కడా తలెత్తకుండా నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని వారు కోరుతున్నారు.

Tags :
|

Advertisement