పెళ్లి కుదర్లేదని మనస్తాపానికి గురై ఉరేసుకున్న యువకుడు
By: chandrasekar Tue, 13 Oct 2020 4:27 PM
26 ఏళ్ల ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తనను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలెవరూ ముందుకు రావడంలేదని మనస్తాపానికి గురై ఆ
యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలోని
సప్తగిరి కాలనీలో అక్టోబర్ 12 ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి
వెళితే...సప్తగిరి కాలనీకి చెందిన నస్ఫూరి సురేశ్ (26) అనే
యువకుడు స్థానికంగా ఎలక్ట్రిషీయన్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో
బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యులు అతడికి పెళ్లి సంబంధాలు
చూస్తున్నారు.
అయితే.. తనను వివాహం
చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రావడం లేదని సురేశ్ మానసికంగా ఆవేదనకు
గురైయ్యాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి భోజనం చేసిన సురేశ్ తన పెళ్లి గురించి వారి వద్ద చివరిసారిగా గోడు
వెళ్లబోసుకున్నాడు. ఆ తర్వాత అందరూ నిద్రిస్తున్న సమయం చూసి తన గదిలో అర్ధరాత్రి
ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి వెంకట్ ఫిర్యాదు మేరకు
గోదావరిఖని వన్టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు
పేర్కొన్నారు.