Advertisement

  • కొడైకెనాల్‌లో ఆత్మహత్య చేసుకున్న ఖమ్మంకు చెందిన యువ జంట

కొడైకెనాల్‌లో ఆత్మహత్య చేసుకున్న ఖమ్మంకు చెందిన యువ జంట

By: chandrasekar Sat, 08 Aug 2020 7:10 PM

కొడైకెనాల్‌లో ఆత్మహత్య చేసుకున్న ఖమ్మంకు చెందిన యువ జంట


కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోవడంతో ఆర్ధిక ఇబ్బందులు అధికమై ఆత్మహత్యకు పాల్పడిన యువ జంట.ఖమ్మం జిల్లాకు చెందిన యువ జంట కొడైకెనాల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ (25), భద్రాచలం సమీపంలోని చోడవరానికి చెందిన ఏపూరి నందిని 2018లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఏడాది నుంచి కొడైకెనాల్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. కరోనా వ్యాప్తివల్ల అనేక కంపెనీలు మూతపడడంతో అనేకమంది ఉద్యోగాలు కొలిపోయారు.

గడచినా రెండు రోజులుగా వీరు ఇంటి నుంచి బయటకు రాలేదని గుర్తించిన ఇరుగు పొరుగు వారు ఫోన్ చేసినా వీరు తీయలేదని సమాచారం. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా వీరు విగత జీవులుగా పడి ఉన్న విషయం తెలిసింది. లాక్‌డౌన్ కారణంగా వీరిద్దరూ ఉద్యోగాలు కోల్పోయారని దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని సమాచారం. నందిని ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కుదర్లేదని తెలుస్తోంది. దీంతో ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్లాలని నిర్ణయించుకున్నారని నందినికి అక్కడ ఉద్యోగం వచ్చినా వెళ్లడం కుదరకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.

ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల వీరు ఇటు ఇంటికి తిరిగి రాలేక అటు ఆస్ట్రేలియా వెళ్లలేక చేతిలో డబ్బులు లేక తీవ్ర మనోవేదనకు గురైన వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. తెలుగులో సూసైడ్ నోట్ రాసి వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. డబ్బు లేకపోవడంతో గత కొంత కాలంగా వీరు ఫోన్లు రీఛార్జ్ చేయలేదని ఇంట్లో డబ్బులు కూడా లేదని సమాచారం.

మరోవైపు కామారెడ్డి జిల్లాకు చెందిన శరణ్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శుక్రవారం బెంగళూరులో ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లాకే చెందిన తన క్లాస్‌మేట్ రోహిత్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. రోహిత్ మద్యానికి బానిసై తరచుగా గొడవ పడటంతోనే తమ కుమార్తె సూసైడ్ చేసుకుందని శరణ్య తల్లిదండ్రులు తెలియజేసారు.

Tags :

Advertisement