Advertisement

  • ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి...సహజీవనం చేసిన వ్యక్తే హంతకుడు

ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి...సహజీవనం చేసిన వ్యక్తే హంతకుడు

By: chandrasekar Thu, 10 Sept 2020 4:59 PM

ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి...సహజీవనం చేసిన వ్యక్తే హంతకుడు


సికింద్రాబాద్‌లో చోటుచేసుకున్న మహిళ హత్య కేసులో నిందితుడిని కనుగొనగలిగారు పోలీసులు.మిస్టరీగా ఉన్న ఈ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తే హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రహదారి పక్కన ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెంది పడిఉంది.

కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలిని భాగ్యలక్ష్మి(30)గా గుర్తించారు. ఆదివారం రాత్రే హత్య చేసి సోమవారం రాత్రి ఆర్పీ రోడ్డులో పడేసినట్లు తెలిపారు. తనతో సహజీవనం చేసిన వ్యక్తే మహిళను హత్య చేసినట్లు తెలిపారు.

Tags :

Advertisement