Advertisement

  • కుటుంబ కలహాల కారణంగా భర్తపై పెట్రోల్ పోసి తగల బెట్టిన భార్య...

కుటుంబ కలహాల కారణంగా భర్తపై పెట్రోల్ పోసి తగల బెట్టిన భార్య...

By: chandrasekar Sat, 31 Oct 2020 1:42 PM

కుటుంబ కలహాల కారణంగా భర్తపై పెట్రోల్ పోసి తగల బెట్టిన భార్య...


కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తపై, భార్య పెట్రోల్ పోసి తగల బెట్టింది. ఇనకుదురు పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.

మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటి చైర్మన్ షేక్ అచ్చాబా కుమారుడు ఎస్.కే. ఖాదర్ బాషాపై పెద్ద భార్య గురువారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించింది. 50 శాతం కాలిన గాయాలతో ఉన్న ఖాదర్ భాషా ను మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అయన పరిస్థితి విషమంగా ఉ౦ది.

ఖాదర్ భాషాకు ఇద్దరు భార్యలు. భార్యలిద్దరూ అక్క చెల్లెళ్లు. మొదట అక్కను పెళ్లి చేసుకోగా..... రెండు నెలల క్రితం ఆమె చెల్లెల్ని బాషా రెండో పెళ్లి చేసుకున్నాడు. తన దగ్గరకంటే తన చెల్లెలి వద్దే ఎక్కువ కాలం బాషా గడుపుతూ ఉండటంతో మొదటి భార్య, భర్తతో తరచూ గొడవ పడుతూ ఉండేది.

ఈ నేపధ్యంలో గురువారం రాత్రి భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదటి భార్య బాషాపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|

Advertisement