తరచు భార్య భర్తల మధ్య గొడవ వల్ల భర్తను చంపేసిన భార్య
By: chandrasekar Thu, 24 Sept 2020 6:33 PM
కుటుంబంలో గొడవలు
మాములుగా జరిగే విషయం. కానీ తరచు భార్య భర్తల మధ్య గొడవ వల్ల భార్య నే తన భర్తను
చంపేసిన సంఘటన రాజస్థాన్ చోటుచేసుకుంది. తరచూ తనతో గొడవ పడుతుండటంతో భార్య
తన భర్తను చంపేసింది. విషయం బయట పడొద్దని మృతదేహాన్ని ఇంట్లో
దాచిపెట్టింది. దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటన
రాజస్థాన్లోని చురూ జిల్లాలో చోటుచేసుకుంది. చురూ జిల్లాలోని హమిర్వాస్కు
చెందిన నీరజ, నిర్మల్ సింగ్ భార్యా భర్తలు. ఇద్దరు తరచూ గొడవ
పడేవారు. భరించలేని భార్య ఆదివారం రాత్రి తన భర్తను చంపేసింది.
తన భర్తను చంపిన విషయం బయటకు
తెలియకుండా భర్త శవాన్ని మంచంలో దాచిపెట్టింది. సోమవారం సాయంత్రానికి ఇల్లంతా
దుర్వాసనతో నిండిపోయింది. దీంతో అసలు విషయాన్ని పోలీసులకు చెప్పింది. దీంతో ఘటనా
స్థలానికి చేరిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తలించామని
స్టేషన్ హౌస్ ఆఫీసర్ హమిర్వాస్ సుభాష్ చంద్ర తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. నిర్మల్ సింగ్ హత్యకు సంబంధించిన వివరాలు
ఇంకా తెలియవని, అయితే ఇద్దరూ తరుచూ గొడవపడేవారని చెప్పారు.
మరింత సమాచారం దీని గురించి తెలియాల్సివుంది.