Advertisement

దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం

By: chandrasekar Tue, 16 June 2020 11:33 AM

దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం


కరోనా లాక్‌డౌన్ వేళ ఘోర విషాదాలు చూడాల్సి వస్తోంది. ప్రజలు ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఏమిచేయాలో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి సందర్భాలలో ఘోర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సమస్యలతో సతమవుతున్న ఓ వ్యాపారి తన భార్య, పిల్లలైనా ఇబ్బంది పడకుండా బతుకుతారని దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కరోనా మహమ్మారి మనిషి బతుకును ఆగం చేస్తున్న వేళ మరో ఘోర విషాదం వెలుగులోకి వచ్చింది.

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యాపారి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తనను తాను హత్య చేయించుకున్నాడు. ఇందుకోసం ముగ్గురు వ్యక్తులకు సుఫారీ ఇచ్చాడు. నిందితుల్లో ఓ మైనర్ కూడా ఉన్నాడు. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న బాధితుడు తన మరణం తర్వాత ఇన్సూరెన్స్ డబ్బుల ద్వారా తన భార్యా పిల్లలకైనా కాస్త ఉపశమనం లభిస్తుందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనను తాను హత్య చేయించుకున్నాడు.

Tags :
|

Advertisement