దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం
By: chandrasekar Tue, 16 June 2020 11:33 AM
కరోనా లాక్డౌన్ వేళ ఘోర
విషాదాలు చూడాల్సి వస్తోంది. ప్రజలు ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఏమిచేయాలో కూడా తెలియని
పరిస్థితి. ఇలాంటి సందర్భాలలో ఘోర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సమస్యలతో
సతమవుతున్న ఓ వ్యాపారి తన భార్య, పిల్లలైనా ఇబ్బంది పడకుండా బతుకుతారని దారుణ నిర్ణయం
తీసుకున్నాడు. కరోనా మహమ్మారి మనిషి బతుకును ఆగం చేస్తున్న వేళ మరో ఘోర విషాదం
వెలుగులోకి వచ్చింది.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
ఓ వ్యాపారి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తనను తాను హత్య చేయించుకున్నాడు.
ఇందుకోసం ముగ్గురు వ్యక్తులకు సుఫారీ ఇచ్చాడు. నిందితుల్లో ఓ మైనర్ కూడా ఉన్నాడు.
ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న బాధితుడు తన మరణం తర్వాత ఇన్సూరెన్స్ డబ్బుల ద్వారా
తన భార్యా పిల్లలకైనా కాస్త ఉపశమనం లభిస్తుందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనను
తాను హత్య చేయించుకున్నాడు.