పెళ్లి పేరుతో అమెరికాలోని అబ్బాయిని మోసం చేసిన తెలుగు యువతి
By: chandrasekar Thu, 22 Oct 2020 09:21 AM
పెళ్లి పేరుతో
అమెరికాలోని అబ్బాయిని తెలుగు యువతి మోసం చేసింది. ఇప్పటి వరకు ఎన్నారై అబ్బాయిలు, ఇక్కడి
యువతులను పెళ్లి పేరుతో మోసం చేసిన ఉదంతాలే చూశాం. ఈ సారి ఆంధ్రా అమ్మాయి అమెరికా
అబ్బాయిని నిండా ముంచేసింది. మ్యాట్రిమొనిలో పెళ్లి పేరుతో యువతి పరిచయం చేసుకోగా
పూర్తిగా నమ్మేసిన యువకుడు సర్వం సమర్పించుకున్నాడు. అసలేం జరిగిందంటే అమెరికాలో
ఉంటున్న గుంటూరు జిల్లా తెనాలి యువకుడికి ఓ యువతి గాలం వేసింది. మ్యాట్రిమోనిలో ‘మైనేని
సముద్ర’ పేరుతో యువతి పరిచయం చేసుకుంది. ఆ పరిచయం పేరుతో ప్రేమ వల వేసింది. దీంతో
ఆ యువకుడు పూర్తిగా యువతి ట్రాప్లో పడ్డాడు. చివరికి పెళ్లి పీటల మీద కూర్చోవాలని
యువకుడు ముచ్చటపడ్డాడు.
అమ్మాయిని పూర్తిగా
నమ్మిన ఆ అబ్బాయి చివరికి అమ్మాయితో కలసి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
అయితే ఇక్కడే యువతి తప ప్లాన్ అమలు చేసింది. పెళ్లి ఖర్చుల కోసం డబ్బు కావాలంటూ
యువకుడికి వల వేసింది. ఇలా పెళ్లికి షాపింగ్, అవీ ఇవీ అంటూ యువకుడి నుంచి రూ. 7.20
లక్షలు తన అకౌంట్లో వేయించుకుంది. చివరికి పెళ్లి రోజు దగ్గరపడటంతో ఆ అబ్బాయి
ఆగమేఘాల మీద అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడు. పెళ్లి కోసం సదరు యువకుడు యువతి
ఊరికి వెళ్లాడు. అయితే ఆ యువకుడికి యువతి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. యువకుడిని
మోసం చేసి ఆమె పరారైంది. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులను
ఆశ్రయించాడు. ఇలాంటి మోసాలు చూసి చివరికి ఎవరిని నమ్మాలో తెలియడంలేదు.