Advertisement

Viral News: భద్రాచలం రాముని సన్నిధిలో ఓ వింత పక్షి...!

By: Anji Mon, 30 Nov 2020 1:19 PM

Viral News: భద్రాచలం రాముని సన్నిధిలో ఓ వింత పక్షి...!

తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లాలోని భద్రాచలం రాములవారి దేవాలయంలో ఉన్న పూర్వ యాగ శాల వద్ద ఓ వింత పక్షీ ప్రతెక్షమైంది. అది వింత ఆకారంలో ఉండటంతో భక్తులు దాన్ని చూసి కొంత మంది సెల్పీలు ఫోటోలు తీసుకున్నారు.

మరి కొంత మంది మాత్రం అది గుడ్లగూబ మంచిది కాదు చెడుకు సంకేతం అంటున్నారు. అది ఇక్కడకు వచ్చిందంటే... త్వరలో ఏదో ఆపద రాబోతున్నట్లే అన్నారు. కొందరుమాత్రం శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపిస్తే శుభ సూచకమన్నారు.

లక్ష్మీదేవి... స్వామి వారితో కలిసి ప్రయాణించినప్పుడు గరుత్మంతుడిని, ఒంటరిగా ప్రయాణించినప్పుడు గుడ్లగూబను అధిరోహిస్తుంది. ఉల్లూక తంత్రంలో గుడ్లగూబ మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు.

రాత్రి వేళ గుడ్లగూబ ఎవరింటిపైనైనా వాలితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. రాత్రి వేళ గుడ్లగూబ ఎవరింటిపైనైనా వాలితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. పనిమీద బయటకు వెళ్లేటప్పుడు గుడ్లగూబ ఎడమవైపు కనిపిస్తే కార్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా గుడ్లగూబ ఉంటే, అక్కడి స్థానికులకు సిరిసంపదలు వస్తాయన్నారు. మొత్తం మీద ఈ వింత పక్షి కనిపించడంతో రాముడి ఆలయానికి వచ్చిన భక్తులతో పాటు.. స్థానికులు దాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. అందరూ ఆ పక్షిని తన సెల్ ఫోన్లో బంధించేందుకు పోటీ పడ్డారు.

Tags :

Advertisement