Advertisement

  • దుబాయి లాటరీలో 10 లక్షల డాలర్లు గెలిచిన భారత సంతతి వ్యక్తి...

దుబాయి లాటరీలో 10 లక్షల డాలర్లు గెలిచిన భారత సంతతి వ్యక్తి...

By: chandrasekar Fri, 06 Nov 2020 03:59 AM

దుబాయి లాటరీలో  10 లక్షల డాలర్లు గెలిచిన భారత సంతతి వ్యక్తి...


జీవితం మొత్తం సాఫీగా సాగిపోవడానికి 10 లక్షల డాలర్లు ఉంటె చాలు. వడ్డీతోనే బతికేయోచ్చు.. అని ఒక మధ్యతరగతి వ్యక్తి ఆలోచన. ఇందులో నిజం కూడా ఉంది. మీకు ఇంత పెద్ద ఎమౌంట్ బహుమతిగా దొరకితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దుబాయిలోని ఒక వ్యక్తికి ఇలాగే కాసుల పంట పండింది. సమాచారం ప్రకారం బహ్రెయిన్ లో నివసించే భారత సంతతికి చెందిన ఒక వ్యక్తికి దుబాయి డ్యూటీ ఫ్రీ డ్రా ( DDF ) లో పది లక్షల డాలర్లు వరించాయట.

గల్ఫ్ న్యూస్ రిపోర్టు ప్రకారం బుధవారం రోజు 33 సంవత్సరాల సునీల్ కుమార్ ఠాకురియా డీడీఎఫ్ మిలేనియం మిలియనేర్ డ్రాలో పది లక్షల డాలర్లు వరించాయి. ఈ డ్రాలో విజేతగా నిలిచిన 170 భారతీయుడిగా నిలిచాడు. అక్టోబర్ 17వ తేదీన అతను ఈ లాటరీ టికెట్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడు. లాటరీ గెలవడంపై టాకురియా సంతోషం వ్యక్తం చేశాడు. గల్ఫ్ న్యూస్ తో మాట్లాడిన ఆయన గత రెండు తరాలుగా బహ్రెయిన్ లో నివసిస్తున్నాం. ఈ డబ్బులను నేను సద్వినియోగం చేసుకుంటాను. కొంత మొత్తం దానం చేస్తాను. సొంతిల్లు కొనుగోలు చేస్తాను. ఈ విజయం నాలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది అని సునీల్ కుమార్ అన్నారు.


Tags :

Advertisement