- హోమ్›
- వార్తలు›
- శ్రీనివాసరెడ్డి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు చంద్రశేఖర్ అనే వ్యక్తి అరెస్ట్
శ్రీనివాసరెడ్డి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు చంద్రశేఖర్ అనే వ్యక్తి అరెస్ట్
By: chandrasekar Sat, 18 July 2020 11:46 AM
నాయుడుపాలెం గ్రామానికి
చెందిన తొట్టెంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి
ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద సోషల్ మీడియాలో
పోస్టులు పెట్టినందుకు అతనితో పాటు మరికొంత మందిని అరెస్టు చేశారు. వారిని ఒంగోలు
తాలూకా పోలీస్స్టేషన్ కి తరలించారు.
మరోవైపు టీడీపీ అధినేత
చంద్రబాబునాయుడు కూడా ఓ ట్వీట్ చేశారు. బాలినేని మీద సోషల్ మీడియాలో పోస్టులు
పెడుతున్న వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి బాలినేనికి సంబంధించిన
డబ్బులు ఇటీవల తమిళనాడులో ఓ కారులో దొరికాయని ప్రచారం జరిగింది. సుమారు రూ.4 కోట్ల
నగదు, బంగారం
లభించాయి.
దీనిపై తీవ్ర దుమారం
రేగింది. ఈ క్రమంలో అసలు అంత డబ్బు ఏపీ పోలీసుల కన్నుగప్పి తమిళనాడుకు ఎలా
వెళ్లిందంటూ ఓ యువకుడు ప్రశ్నిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేస్తే పోలీసులు అతడిని
అరెస్టు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
తమిళనాడులో పట్టుబడిన
డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం
చేశారు. ఆ కారులో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ అని దీనిపై సమగ్రంగా విచారణ
జరపాలని పోలీసులను కోరతామన్నారు.