విజయవాడలో కాల్పులు కలకలం...యువకుడు మృతి
By: Sankar Sun, 11 Oct 2020 10:43 AM
విజయవాడలో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. అర్ధరాత్రి ఓ యువకుడిని దుండగులు కాల్చిచంపారు. మృతుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్ గా గుర్తించారు.
ఈ ఘటన విజయవాడ శివారు బైపాస్ రోడ్డులోని బార్ సమీపంలో చోటుచేసుకుంది. నిందితులు పక్క ప్లాన్ ప్రకారమే మహేష్ను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన ఘటనా స్థలాన్ని సీపీ బత్తిన శ్రీనివాసులు అర్ధరాత్రి పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాయి.
అయితే.. ఈ కాల్పుల ఘటనకు కారణం రియల్ ఎస్టేట్ వివాదం కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్కూటీపై వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. కాల్పులు జరిగే సమయంలో మృతుడు మహేష్తో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.