Advertisement

  • హిందూపురం లో దారుణం...కార్మికుల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి మృతి

హిందూపురం లో దారుణం...కార్మికుల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి మృతి

By: Anji Thu, 03 Dec 2020 6:39 PM

హిందూపురం లో దారుణం...కార్మికుల మధ్య ఘర్షణ  ఓ వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా హిందూపురం మండలం పారిశ్రామికవాడలో... కార్మికుల మధ్య ఘర్షణ తలెత్తింది. దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసే కార్మికుల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన రత్నాకర్ జిన్నా అనే వ్యక్తిని... రాజేష్ జిన్నా అనే మరో వ్యక్తి కత్తితో పొడిచాడు.

ఈ ఘటనలో.. రత్నాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నిందితుడు రాజేష్ తిన్నాను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.కార్మికుల మధ్య ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

Advertisement