Advertisement

  • హైదరాబాద్ లో దారుణం: అల్లుడిని కిరాతకంగా హత్య చేయించిన మామ..!

హైదరాబాద్ లో దారుణం: అల్లుడిని కిరాతకంగా హత్య చేయించిన మామ..!

By: Anji Fri, 25 Sept 2020 1:24 PM

హైదరాబాద్ లో దారుణం: అల్లుడిని కిరాతకంగా హత్య చేయించిన మామ..!

హైదరాబాద్ లో పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కక్షతో అల్లుడిని కిరాతకంగా హత్యచేయించారు. చందానగర్ కు చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం వీరిద్దరూ గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనిలో నివాసం ఉంటున్నారు.

కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడంపై తండ్రి ఆగ్రహంతో ఉంటున్నాడు. ఇక ఈ క్రమంలో కిరాయిగుండాలతో అతన్ని హత్య చేయించాలని భావించి.. గురువారం హేమంత్ ను కిడ్నాప్ చేయించాడు. హేమంత్ కిడ్నాప్ అవ్వడంతో అతడి కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పీఎస్ లో పిర్యాదు చేశారు. కానీ ఇంతలోనే అతను సంగారెడ్డి లో శవమై కనిపించాడు.

యువతీ తండ్రి కిరాయి హంతకులతో హత్య చేయించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు హేమంత్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ హత్యకు సంబంధించి యువతీ తల్లిదండ్రులతో పాటు మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Advertisement