Advertisement

ఢిల్లీ సమీపంలో 2.3 తీవ్రతతో భూకంపం

By: chandrasekar Fri, 25 Dec 2020 11:58 PM

ఢిల్లీ సమీపంలో 2.3 తీవ్రతతో భూకంపం


ఈ రోజు శుక్రవారం డిసెంబర్ 25 న తెల్లవారుజామున ఢిల్లీ సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 2.3గా నమోదయినది. ఈ రోజు తెల్లవారుజామున 5:02 గంటలకు మరో భూకంపం ఢిల్లీ సమీపంలోని లోని నాంగ్లోయి ప్రాంతంలో తేలికపాటి భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో భవనాల నుండి వీధుల్లోకి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ లో కాస్త కలకలం రేపింది.

భూకంపం రిక్టర్ స్కేల్‌పై 2.3 గా ఉంది. గత ఒక వారంలో ఢిల్లీ లో జరిగిన రెండవ భూకంపం ఇది. అంతకుముందు డిసెంబర్ 17 న భూకంపం ఢిల్లీ ఎన్‌సిఆర్‌ను తాకింది. అప్పుడు రిక్టర్ స్కేల్‌పై 4.2 గా నమోదైనది. అదేవిధంగా, ఈ రోజు ఉదయం 5:13 గంటలకు ఫిలిప్పీన్స్‌లో మనీలాను శక్తివంతమైన భూకంపం కదిలించింది. ఇక్కడ రిక్టర్ స్కేల్‌లో 6.2 గా నమోదు చేయబడింది. భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్థి నష్టం జరగలేదు.

Tags :
|

Advertisement