సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన హైదరాబాద్కు చెందిన ఓ న్యాయవాది
By: chandrasekar Mon, 15 June 2020 3:55 PM
సైబర్ నేరగాళ్ల వలలో
చిక్కిన హైదరాబాద్కు చెందిన ఓ న్యాయవాది తన ఖాతాలో డబ్బులను పోగుట్టుకున్నాడు.
మాసబ్ ట్యాంక్కు చెందిన ఓ లాయర్ తన ఇంట్లో ఉన్న పాత ట్రెడ్మిల్ను అమ్మేందుకు
ఓఎల్ఎక్స్లో యాడ్ పెట్టాడు. దానిని చూసిన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, తాను
ఆర్మీలో పనిచేస్తున్నానని నమ్మబలికాడు. హైదరాబాద్కు చెందిన ఓ న్యాయవాది సైబర్
నేరగాళ్లకు చిక్కి రూ.1.5 లక్షలు పోగొట్టుకున్నారు. వాడిన వస్తువులను (సెకండ్
హ్యాండ్) ఇతరులకు విక్రయించే వేదిక అయిన ఓఎల్ఎక్స్లో తన ట్రెడ్ మిల్ అమ్మేందుకు
ప్రయత్నించి లాయర్ మోసపోయారు.
పోలీసులు వెల్లడించిన
వివరాల ప్రకారం మాసబ్ ట్యాంక్కు చెందిన ఓ లాయర్ తన ఇంట్లో ఉన్న పాత ట్రెడ్మిల్ను
అమ్మేందుకు ఓఎల్ఎక్స్లో యాడ్ పెట్టాడు. దానిని చూసిన గుర్తు తెలియని వ్యక్తి
ఫోన్ చేసి, తాను ఆర్మీలో పనిచేస్తున్నానని నమ్మబలికాడు. దాన్ని
తాను కొంటానని చెప్పాడు. ఆర్మీ అనడంతో ఆ మాటలు నమ్మేసిన లాయర్ ధరను కూడా
మాట్లాడుకొని రూ.10 వేలకు ఒప్పందం చేసుకున్నారు. కానీ డబ్బు పంపేందుకు
టెస్టింగ్గా ముందుగా తనకు గూగుల్ పేలో రూ.5 పంపించాలని, ఆ వెంటనే రూ.10 పంపిస్తానంటూ నమ్మించాడు. సైబర్ నేరగాడు
చెప్పినట్లుగానే బాధితుడు రూ.5 పంపించగానే తిరిగి రూ.10 లాయర్
అకౌంట్లో జమ అయింది.
తనకు పంపిన మొత్తానికి
రెట్టింపు పంపిస్తానంటూ నమ్మించి క్యూఆర్ కోడ్తో న్యాయవాదిని బురిడీ
కొట్టించాడు. లాయర్ గూగుల్ పే అకౌంట్కు మూడు అకౌంట్లు లింక్ అయి ఉండగా రెండు
ఖాతాల్లో నుంచి రూ.1.5 లక్షలను సైబర్ మోసగాళ్లు స్వాహా చేశారు. అయితే, తన
అకౌంట్ నుంచి డబ్బులు ఎలా మాయమయ్యాయో అర్థం కావడం లేదని బాధితుడు పోలీసులకు
ఫిర్యాదు చేశారు. అయితే సైబర్ నేరగాళ్లు బాధితుడిని నెమ్మదిగా తమ వలలోకి దింపి, తమ
మాటలు నమ్మించేలా చేసి క్యూఆర్ కోడ్తో ఖాతాల్లో నుంచి డబ్బును దొంగిలించేశారని
పోలీసులు వివరించారు. ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తతో ఉండాలని పోలీసులు ప్రజలను
తెలియజేసారు.