భార్యకు కరోనా సోకిందని ఓ భర్త బలవన్మరణం
By: chandrasekar Tue, 28 July 2020 5:37 PM
రాష్ట్రం లో కరోనా
విజృంభణ ఎక్కువవుతున్నది. ఎన్నెన్నో బాధాకరమైన సంభవాలు చూస్తూనే ఉన్నాము. ఈ
నేపథ్యంలో విజయనగరం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యకు కరోనా
సోకిందని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. పార్వతీపురం చెందిన ఓ మహిళ
కొద్దిరోజులు అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా
పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు.
తన భార్యకు కరోనా
సోకిందని భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో రైలు కిందపడి ఆత్మహత్యకు
పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలచివేసింది. బాధితుడికి భార్యకు కరోనా
సోకడం భర్త చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
స్థానికుల సమాచారం మేరకు
ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం
తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.