ఒడిశా రాజధాని భువనేవ్వర్లో భారీ అగ్నిప్రమాదం
By: chandrasekar Thu, 08 Oct 2020 5:42 PM
రాజ్భవన్కు సమీపంలోని
ఓ పెట్రోల్ పంపులో ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో సిబ్బంది, పెట్రోల్
కోసం వచ్చిన వాహనదారులు భయంతో పరుగులు తీశారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం
మేరకు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలు
ఆర్పుతున్నారు.
రాజ్భవన్కు సమీపంలోనే
ప్రమాద స్థలం ఉండటంతో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. రాజ్భవన్
పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు
అందిన సమాచారం ప్రకారం ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని
చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారని భువనేశ్వర్ నగర పోలీస్ కమిషనర్
సుధాన్షు సారంగి పేర్కొన్నారు.
Tags :
broke |