ఏపీ బీజేపీ నేత సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500 క్రింద కేసు నమోదు
By: chandrasekar Fri, 14 Aug 2020 7:13 PM
ఏపీ బీజేపీ నేత సాధినేని
యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500 క్రింద కేసు నమోదు చేయబడింది. ఏపీ బీజేపీ నేత
సాధినేని యామిని చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల జరిగిన
అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత
వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు
ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు.
రాష్ట్ర అసెంబ్లీ
ఎన్నికలు 2019 ముందు వరకు టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.
తెలుగు దేశం పార్టీ ఓటమి పాలవడంతో ఆమె గుర్తింపును నోచుకోలేదు. అందువల్ల టీడీపీ
ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో ఆ తర్వాతి కాలంలో బీజేపీ తీర్థం
పుచ్చుకున్నారు. కాగా సోషల్ మీడియా ద్వారా ఆమె తాజా రాజకీయ పరిణామాలపై కామెంట్స్
చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆమెపై కేసు
నమోదు చెయ్యబడింది.