ప్రారంభానికి ముందే మళ్ళీ ఒక వంతెన కొట్టుకుపోయింది.
By: chandrasekar Sat, 19 Sept 2020 1:32 PM
బీహార్ రాష్ట్రంలో గోబరి
గ్రామంలో కంకై నదిపై ఒక వంతెనను నిర్మించారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు
నదిలో నీటి మట్టం బాగా పెరిగింది. దీంతో నీటి ప్రవాహం వల్ల కొత్తగా నిర్మించిన
వంతెనలో కొంత భాగం కొట్టుకుపోయింది.
ఈ నేపథ్యంలో ప్రారంభానికి
ముందే బ్రిడ్జి కొట్టుకుపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. వంతెనను కాంట్రాక్టర్
సరిగా నిర్మించలేదని ఆరోపిస్తున్నారు. బీహార్లోని కోసి నదిపై నిర్మించిన మెగా
రైల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు.
కాగా ఈ రోజునే రాష్ట్రంలో
నిర్మించిన మరో వంతెన కొట్టుకుపోవడం గమనార్హం. బీహార్తోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్
రాష్ట్రాల్లో నిర్మాణం పూర్తయిన కొన్ని వంతెనలు ప్రారంభం కాకముందే ఇటీవల కురిసిన
భారీ వర్షాలకు కొట్టుకుపోయాయి.