Advertisement

  • ఓ యువతి ఫై ఏళ్ల తరబడి అత్యాచారం... 100 పేజీల ఫిర్యాదు

ఓ యువతి ఫై ఏళ్ల తరబడి అత్యాచారం... 100 పేజీల ఫిర్యాదు

By: chandrasekar Sat, 22 Aug 2020 5:09 PM

ఓ యువతి ఫై ఏళ్ల తరబడి అత్యాచారం... 100 పేజీల ఫిర్యాదు


ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ''నాపై 143 మంది ఏళ్ల తరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించారు. నగ్నంగా చిత్రాలు, వీడియోలు తీశారు. వారిలో విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకుల పీఏలతో పాటు సినీ పరిశ్రమ వారూ ఉన్నారు. ఇప్పుడు వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది'' అంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై సామూహిక అత్యాచారాలు, వేధింపులు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగాయని తెలిపింది. వారు తనను వదిలిపెట్టరని, ఇదే చివరి వాంగ్మూలమని పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు 143 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన ఈ యువతికి మిర్యాలగూడకు చెందిన వ్యక్తితో 2009 జూన్‌లో వివాహమైంది. అత్తవారింట్లో వేధింపులు తట్టుకోలేక 2010 డిసెంబరులో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. పుట్టింట్లో ఉండి చదువుకుంటుండగా విద్యార్థి సంఘం నాయకులతో పాటు పలువురితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం క్రితం రాజ్‌భవన్‌ రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగింది. ఈ క్రమంలో తనపై మాజీ ఎంపీ పీఏ, విద్యార్థి సంఘం నాయకులు ముగ్గురు, మరో 139 మంది కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది.

తనతో నగ్నంగా నృత్యాలు చేయించేవారని, ఫొటోలు, వీడియోలు తీస్తూ ఆనందం పొందేవారని, వారి స్నేహితులతో కూడా గడపాలని బెదిరించేవారని, సహకరించకపోతే చంపుతామనేవారని యువతి తెలిపింది. వారు మరికొందరు యువతులపైనా అఘాయిత్యాలకు పాల్పడ్డారని తెలిపింది. న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తును సీసీఎస్‌ లేదా సీఐడీకి అప్పగించే అవకాశాలున్నాయి.

Tags :

Advertisement