Advertisement

  • ఓ 100 కిలోల‌ భారీ తాబేలు స‌ముద్ర తీరానికి కొట్టుకొచ్చింది...!

ఓ 100 కిలోల‌ భారీ తాబేలు స‌ముద్ర తీరానికి కొట్టుకొచ్చింది...!

By: chandrasekar Tue, 13 Oct 2020 4:16 PM

ఓ 100 కిలోల‌ భారీ తాబేలు స‌ముద్ర తీరానికి కొట్టుకొచ్చింది...!


ఓ భారీ తాబేలు త‌మిళ‌నాడు రాష్ట్రం రామ‌నాథ‌పురం జిల్లాలో స‌ముద్ర తీర ప్రాంతానికి కొట్టుకొచ్చింది.

సముద్ర‌పు అల‌ల‌వ‌ల్ల‌ జిల్లాలోని మండ‌పం తీరానికి ఈ తాబేలు కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రానికి, అట‌వీ అధికారులకు స‌మాచారం అందించారు.

వెంట‌నే అధికారులు అక్క‌డికి చేరుకుని దాన్ని ప‌రీక్షించి మ‌ళ్లీ సుర‌క్షితంగా స‌ముంద్రంలో విడిచిపెట్టారు.

కాగా ఆ తాబేలు బ‌రువు 100 కిలోల‌కు పైగానే ఉంద‌ని అధికారులు తెలిపారు. స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా ఉన్న‌ప్పుడు భారీ అల‌లు వ‌స్తాయ‌ని, ఆ అల‌ల్లో ప‌డి తాబేలు తీరానికి కొట్టుకొచ్చి ఉంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు.

Tags :
|
|
|

Advertisement