ఏపీలో 9,024 పాజిటివ్ కేసులు
By: chandrasekar Wed, 12 Aug 2020 4:59 PM
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో గడిచిన 24
గంటల్లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 87 మంది
మృతి చెందినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 9,113 మంది కరోనా నుండి
కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,44,549 కు చేరింది. 1,54,749 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 2203 కు
చేరింది.
కరోనా బారిన పడి మంగళవారం
అనంతపూర్లో 13 మంది, చిత్తూరులో 12 మంది, గుంటూరులో 9 మంది, విశాఖపట్టణంలో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, కడపలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, తూర్పుగోదావరిలో
ఐదుగురు, నెల్లూరులో
ఐదుగురు, విజయనగరంలో
ఐదుగురు, కృష్ణాలో
ముగ్గురు, కర్నూలులో
ముగ్గురు మరణించారు.
Tags :
cases |
corona |