Advertisement

  • కరోనా ఉగ్రరూపం భారత్‌లో 24 గంటల్లో మరో 90,123 పాజిటివ్ కేసులు

కరోనా ఉగ్రరూపం భారత్‌లో 24 గంటల్లో మరో 90,123 పాజిటివ్ కేసులు

By: Anji Wed, 16 Sept 2020 3:16 PM

కరోనా ఉగ్రరూపం భారత్‌లో 24 గంటల్లో మరో 90,123 పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 90,123 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,20,360 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 9,95,933 యాక్టివ్ కేసులు ఉండగా, 39,42,360 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,290 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 82,066 కు చేరింది.

ఇక నిన్న దేశవ్యాప్తంగా 82,961 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,16,842 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 78.53 శాతం ఉండగా, మరణాల రేటు 1.63 శాతంగా ఉంది.

Tags :
|
|

Advertisement