90 ఏళ్ల పండు వృద్ధురాలిపై అత్యాచారం...ఉరితీయాలని కోరిన వృద్ధురాలు
By: chandrasekar Thu, 10 Sept 2020 08:12 AM
రాజధాని ఢిల్లీలో 90 ఏళ్ల
పండు ముసులమ్మపై అత్యాచారానికి
పాల్పడ్డాడు ఓ కామాంధుడు. నజఫ్గర్ ప్రాంతంలోని ఛావ్లాలో సోమవారం సాయంత్రం చోటు
చేసుకున్న ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్
సీరియస్ అయ్యింది. నిందితుడిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు
డీసీడబ్ల్యూ ధృవీకరించింది. నిందితుడిని ఢిల్లీలోని రెవ్లా ఖాన్పూర్ ప్రాంతానికి
చెందిన 33 ఏళ్ల
వయస్కుడైన సోనుగా గుర్తించారు.
పోలీసులు ఇచ్చిన వివరాల
ప్రకారం... వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు బలవంతంగా ఆమెను బయటకు
తీసుకెళ్లి అత్యాచార౦ చేసాడు. మహిళ ఏడుపులు విని అక్కడకు చేరుకున్న స్థానికులు
నిందితుడిని పట్టుకుని స్థానిక పోలీసులకు
అప్పగించారు. బాధితురాలిని స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించిన డీసీడబ్ల్యూ
చీఫ్ స్వాతి మనివాల్ కామాంధుడి లైంగిక దాడిలో ఆమె తీవ్ర గాయాలపాలైనట్లు తెలిపారు.
స్వామి మనివాల్ స్వయంగా ఆ
వృద్ధురాలిని కలిసి దారుణ ఘటనపై ఆరా తీశారు. ఎంత ప్రాధేయపడినా వినిపించుకోకుండా
తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు కంటతడి పెట్టుకున్న ఆ వృద్ధురాలు నిందితుడిని
ఉరితీయాలని కోరినట్లు తెలిపారు. నిందితుడిపై సెక్షన్ 376, 363 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.