Advertisement

  • తమిళనాడు బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు..తొమ్మిది మంది మృతి

తమిళనాడు బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు..తొమ్మిది మంది మృతి

By: Sankar Fri, 04 Sept 2020 3:58 PM

తమిళనాడు బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు..తొమ్మిది మంది మృతి


తమిళనాడులో ఘోర విషాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ బా ణాసంచా కర్మాగారంలో సంభ‌వించిన‌ పేలుడులో 9 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కడలూరు జిల్లా కట్టమన్నార్‌ కోయిల్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు.

గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఫ్యాక్టరీలో కార్మికులు పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. అందులోనే ఉన్న కొంత మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ క‌ర్మాగారం కుప్ప‌కూలిపోయింది . ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సంఘటన ఎలా జరిగిందనే దానిపై ద‌ర్యాప్తు ప్రారంభించారు

Tags :
|

Advertisement