Advertisement

  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కోటీశ్వరులు ఎంతమందో తెలుసా !

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కోటీశ్వరులు ఎంతమందో తెలుసా !

By: Sankar Wed, 11 Nov 2020 10:08 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కోటీశ్వరులు ఎంతమందో తెలుసా !


బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు నిన్నటి రోజున రిలీజైన సంగతి తెలిసిందే. మొత్తం 243 మంది సభ్యుల్లో 241 మందికి సంబంధించిన అఫిడవిట్ల డేటాను ఏడీఆర్ పరిశీలించింది.

గెలుపొందిన అభ్యర్థులకు సంబంధించిన అఫిడవిట్ల వివరాల ప్రకారం 81 శాతం మంది కోటీశ్వరులని తేలింది. 241 మందిలో 194 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఇందులో బీజేపీ 65, ఆర్జేడీ 64, జేడియు 43, కాంగ్రెస్ 14 మంది అభ్యర్థులు ఒక్కొక్కరు సగటున కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏడీఆర్ డేటా తెలియజేసింది.

ఇక 241 మంది అభ్యర్థుల్లో 163 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా తేలింది. క్రిమినల్ కేసులు కలిగిన 163 మందిలో 123 మందిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ , నితీష్ కుమార్ జెడియు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే..

Tags :

Advertisement