కరీంనగర్ లో విజృంభిస్తున్న కరోనా ..భయాందోళనలో ప్రజలు ..
By: Sankar Tue, 14 July 2020 6:56 PM
కరీంనగర్ లో తిరిగి కరోనా విజృంభించింది ..ఒకేరోజు 79 మందికి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదర్శ నగర్కు చెందిన ఓ యువకుడు పాజిటివ్ వచ్చినప్పటికీ నగరంలో యదేచ్చంగా తిరగడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి రోడ్డు మీద తిరిగిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
దీంతో అతను కోవిడ్ పేషంట్ కాదని, అతను అంబులెన్సులో తీసుకెళ్లిన వ్యక్తికి పాజిటివ్ రావడంతో జూలై 1వ తేదీ నుంచి హోం క్వారంటైన్లో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో అతడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యశాఖకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ సకాలంలో సిబ్బంది రాకపోవడంతో నడుచుకుంటు ఆసుపత్రికి బయల్దేరినట్లు స్థానికులు వివరించారు..
రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సదరు కరోనా పాజిటివ్ వ్యక్తిని గమనించిన మున్సిపల్ సిబ్బంది అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు చెప్పారు. దీంతో సమాచారం ఇచ్చిన స్పందించని వైద్య అధికారుల నిర్లక్ష్యానికి ఈ సంఘటన నిలువెత్తు సాక్ష్యమని స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.