Advertisement

  • ఇండియా లో 76.7 కోట్లకు చేరుకున్న ఇంటర్నెట్ సేవలు

ఇండియా లో 76.7 కోట్లకు చేరుకున్న ఇంటర్నెట్ సేవలు

By: chandrasekar Mon, 16 Nov 2020 8:37 PM

ఇండియా లో 76.7 కోట్లకు చేరుకున్న ఇంటర్నెట్ సేవలు


మన దేశంలో ఇంటర్నెట్ సేవలు ఆగస్టు 31 నాటికి మొత్తం కనెక్షన్లు 76.7 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో ఆగస్టు 31 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 75 కోట్లకు చేరుకుంది. దేశంలో తొలిసారిగా 1995 ఆగస్టు 15న ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. అంటే ఈ 25 ఏళ్లలో ఇంటర్నెట్ కనెక్షలు 75 కోట్లకు చేరుకోవడం విశేషం. మార్చి 2015లో ప్రారంభమైన డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌తో సమానంగా 2016 నుంచి కేవలం గత నాలుగేళ్లలో కనెక్షన్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఇక మొత్తం 75 కోట్ల కనెక్షన్లలో అధిక భాగం పట్టణ ప్రాంతాల్లోనే ఉండగా మొబైల్ ఫోన్స్, డాంగిల్ ద్వారా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. టెలికమ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సమాచారం ప్రకారం జూన్ 2020 నాటికి దేశంలో 749 మిలియన్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 50.8 మిలియన్ల నారోబ్యాండ్, 698.2 మిలియన్లు బ్రాండ్‌బ్యాండ్. మరో ప్రత్యేక నివేదిక ప్రకారం ఆగస్టు 31 నాటికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు 71కోట్ల (716 మిలియన్లు)కు చేరాయి. న్యారోబ్యాండ్ కనెక్షన్లలో మాత్రం పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. ఆగస్టు 31 నాటికి మొత్తం అంతర్జాల కనెక్షన్లు 76.7 కోట్లకు చేరాయి. గత సంవత్సరం సెప్టెంబరు 2018 నాటికి భారత్‌ అంతర్జాల కనెక్షన్లు 50 కోట్ల మార్క్‌కు చేరుకున్నాయి. అప్పటి నుంచి నెలకు సగటున 86 లక్షల కొత్త కనెక్షన్లు చేరుతున్నాయి.

ఈ సంవత్సరం ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొత్తం అంతర్జాల కనెక్షన్లలో 61 శాతం పట్టణ ప్రాంతాల్లోనే ఉండగా వీటిలో 97 శాతం వైర్‌లెస్ కనెక్షన్లు. సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేట్ ఆఫ్ ఇండియా (కోయ్) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఎస్పీ కొచ్చర్ మాట్లాడుతూ, మా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లలో 97% మొబైల్‌లలో ఉన్నప్పటికీ కేవలం 50 శాతం మందికే తగినంత నెట్‌వర్క్ కవరేజ్ ఉంది. ఇది మరింత పెరగాలి సరసమైనదిగా ఉండాలి. అయితే సేవలలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దేశంలోని మొత్తం అంతర్జాల కనెక్షన్‌లలో 35 శాతం (26 కోట్లు) కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ కనెక్షన్‌లలో జియో తొలి స్థానంలో ఉండగా తర్వాతి స్థానంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఉన్నాయి. మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య 75 కోట్లు దాటినా వాస్తవానికి అదే సంఖ్యలో ప్రజలు ఇంటర్నెట్‌‌ సౌకర్యం కలిగి ఉన్నారని చెప్పలేము. కరోనా వల్ల చాలా మంది ఆన్ లైన్ క్లాసుల కోసం ఇంటర్నెట్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

Tags :
|
|

Advertisement