Advertisement

మహారాష్ట్రలో తాజాగా 66 కరోనా మరణాలు

By: Sankar Sun, 27 Dec 2020 9:55 PM

మహారాష్ట్రలో తాజాగా 66 కరోనా మరణాలు


దేశ వ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికి మహారాష్ట్రలో మాత్రం ఇంకా అదే తీవ్రత కొనసాగుతుంది..ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు నమోదు అయ్యే కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ ఇప్పటికి కూడా ప్రతిరోజు వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి...

తాజాగా శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,314 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,19,550కు, మరణాల సంఖ్య 50 వేలకుపైగా పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 2,124 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,09,948కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 59,214 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

Tags :
|

Advertisement