దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 61,408 కరోనా కేసులు
By: chandrasekar Mon, 24 Aug 2020 1:03 PM
దేశంలో అదుపు చేయలేని విధంగా అతి వేగంగా వ్యాపిస్తున్న కరోనా కేసులు ఆదివారం కూడా ఎక్కువ సంఖ్యలోనే నమోదు చేయబడింది. భారత్లో కరోనావైరస్ మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. కరోనా మరణాలు కూడా భారీ సంఖ్యలో సంభవిస్తున్నాయి. గత 24
గంటల్లో ఆదివారం, ఆగస్టు 23న కొత్తగా
61,408 కరోనా కేసులు నమోదు కాగా
836 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు.
దేశంలో కరోనా బారిన పడ్డ వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాలతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య
31,06,349కి చేరగా మరణాల సంఖ్య 57,542కి పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7,10,771 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. అయితే ఆదివారం ఒక్కరోజే కరోనా నుంచి 57,468 బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
గడచిన 24
గంటల్లో దేశంలో
6,09,917 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం
3.59 కోట్లకు పైగా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ఇలాఉంటే దేశంలో కరోనా రికవరీ రేటు 75శాతం దాటగా మరణాల రేటు 1.85గా ఉందని తెలిపారు. ముఖ్యంగా మాస్కులు ధరించడం మరియు సాంఘీక దూరం పాటించడం వల్ల వైరస్ కరోనా బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు.