కామెరూన్లో బస్సు ప్రమాదంలో 60 మంది మృతి...
By: chandrasekar Mon, 28 Dec 2020 1:24 PM
కామెరూన్లో బస్సు లోయలో
పడిపోయింది. ఈ ప్రమాదంలో 60 మంది మరణించినట్లు సమాచారం. 70 మంది
ప్రయాణిస్తున్న బస్సు పశ్చిమ నగరం కామెరూన్ నుండి రాజధాని యౌండాకు
ప్రయాణిస్తున్నది. తెల్లవారుజామున 2 గంటలకు బస్సు పోతుండగా కొంత మంది ప్రజలు రోడ్డు
దగ్గర నిలబడ్డారు.
వారిని తప్పించేందుకు
డ్రైవర్ బస్సును తిప్పాడు. అప్పుడు ఊహించని విధంగా లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో
ప్రయాణిస్తున్న అరవై మంది చనిపోయారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
Tags :
cameroon |
bus |