Advertisement

రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం ...ఆరుగురు మృతి

By: Sankar Mon, 07 Dec 2020 5:13 PM

రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం ...ఆరుగురు మృతి


రాజ‌స్థాన్ రాష్ట్రం చురు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. జీపు-ట్ర‌క్కు ఎదురెదురుగా ఢీకొన‌డంతో జీపులో ఉన్న ఆరుగురు ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.

మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. జీపు బిక‌నీర్‌లోని దుంగార్‌గ‌ఢ్‌కు వెళ్తుండ‌గా భ‌నిపుర స‌మీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. స‌మాచారం అందిన వెంట‌నే ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను చికిత్సి నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి పంపించారు.

మృతుల‌ను లాలారామ్ , రేష్మి , క‌నారామ్ , క‌ళావ‌తి , క‌మ‌ల , సీమాదేవి గా పోలీసులు గుర్తించారు. కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని చెప్పారు.

Tags :
|
|

Advertisement